శ్రీ కృష్ణ కమిటీ ఒక నికృష్ట కమిటీ

జస్టిస్ శ్రీకృష్ణా! ఏందీ ఇట్లా జేసినవ్ ఇంత బతుకు బతికి ఇంటెనక పడి చచ్చినట్లు ఇదేంది ఇంత అడ్డగోలు రిపోర్ట్ ఇచ్చినావ్ మా ఆంధ్రోల్లు మంచిగ అరుసుకున్నట్ల గొడ్తుంది మాకు తెలుసు మా ఆంధ్ర లీడర్లు ఇసొంటి దాంట్ల మంచి మొనగాండ్లు ఆల్ ఇండియా లెవల్ల పోటి పెడితే నంబర్ వొన్ పొజిషన్ల ఉంటరు వీళ్ళు గీ పనిల ఎంత మాహెర్లంటే యమ ధర్మరాజసొంటోన్ని కూడా ఎర్రి బాగులోన్ని చేసి నిండా ముంచుతరు అయినా మా కు తెల్వక అడుగుతున్నం గీ ఇంత మాత్రం దానికి ఒక ఏడాదిపాటు రాష్ట్రమంత ఊర్ల పొంటి బా లసంతపోల్లలెక్క ఏషాలేస్కోని గంట కొట్టుకుంట తెగ తిరిగితిరి బైన్లోల్లలెక్క ఎల్లమ్మ కథలు చెప్తిరి రాష్త్రంల అందర్నీ సంతోష పెడత మని ఉత్తర కుమార కోతలు కోస్తిరి అందర్నీ అంటే ఆంధ్రోల్లనని ఇప్పుడర్థమైందనుకో అదేదో పండుగ సంబరమైనట్లు పెద్ద పెద్దోల్లకు విందులిస్తిరి మీడియా వాళ్ళకు మంచి మంచి ‘తోఫా’ లిస్తిరి ప్రజల సొమ్ము 20 (40 ?) కోట్లు ఖర్చు పెడ్తిరి పైకి చెప్పేది అంత, అసలు ఎంత ఖర్చుపెట్టిండ్రో మీ వాళ్ళకు ఎక్కడెక్కడ ఎంతెంత ముట్టిందో ముందు ముందు అంతా తెలుస్తదనుకో౦డ్రి. అయిన అంతా ఆంధ్ర లీడర్లు, గవర్నర్,సి ఎస్, డిజిపి చెప్పినట్లు రాయడానికి ఇంత పగటేశాలె౦దుకు ఇంకొక సంగతి మాకు సరిగ్గ అర్థమైతలేదు నీవు నీ కమిటీ మెంబర్లు ఎంతో సుద్ద పూసలని ఎక్కడెక్కడెనో ఎతికి ఎతికి పట్టుకొచ్చిండ్రు గదా మల్ల ఇప్పుడు ఇట్ల ఇంత మోసం ఎందుకు జేసిండ్రు.

మీ సెక్రెటరి దుగ్గల్, అంత మందు విందులకు, ఇంకా దేనికో అగలేనోన్ని మెంబర్ సెక్రటరీ గ ఎందుకు ఉరుకులాడి ఏసుకోవాల్సి వచ్చింది కృష్ణ, గోదావరి నదులెక్కడున్నవో తెలువని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఎందుకు వచ్చిండు ఊపుకుంట మద్రాస్ కంటే ముందే హైదరాబాద్ లో పవర్ స్టేషన్ ఉందని తెలువని, ఒక ఏడాది తిరిగినా రాష్ట్రం లో ఏ పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోలేక తప్పుల తడకలు రాసిన పవర్ ఎక్స్పర్ట్, రాష్ట్రం లో ముస్లింలు వేరే రాష్ట్రం కోరడం లేదని, అందరు రాష్ట్రం కాదు అభివృద్ధి కోరుకుంటున్న రని అడ్డగోలు అబద్ధాలు రాసిన సామా జిక వేత్తలు, ప్రభుత్వపు తారు మారు తప్పుడు లెక్కలే రైటని ప్రజలిచ్చిన నిజమైన లెక్కల్ని తుంగలో తొక్కి ఫాల్తూ రిపోర్ట్ లిచ్చిన ఎకనామిస్ట్ లను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?

మీ పవర్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ లో ఒక్కటైనా నిజముందని నిరూపిస్తే పది లక్షలు ఇస్తమని ఛాలె౦జ్ చేసినా మీ మెంబర్ల కు ఎవరెవరికి, ఎక్కడెక్కడ, ఎంతెంత ముడుపులు ముట్టినయో, తెర వెనుక ఏ౦ భాగోత౦ జరిగిందో బయట పెడతామని కొందరు చెప్పినా దొంగకు తేలు కుట్టినట్లు కిక్కురుమనకుండా ఉన్నారు ఎందు కు? అవన్నీ నిజమైతేనే గదా? నిప్పు లేనిదే పొగ రాదు అనేది నివొద్దె గదా ?

అయ్యా శ్రీకృష్ణ! నీవు సుప్రీం కోర్ట్ జడ్జివి గదా అని ఎంతోమర్యాదగున్న౦,కాని చూసే కొద్ది చూసే కొద్ది ఇదేంది నీ పనులు ఇంత అధ్వాన్నంగ ఉన్నయి జనం సూడడానికేమో రాష్ట్రమంత పది నెలలు తిరిగి పది గాడిదలు మోసే టంత సమాచారం తెప్పించుకొని అంత బుట్ట దాఖలు చేసి, ఆ పేపర్లు అమ్మితే సుమారైన పైసలొచ్చిఉండొచ్చుఎవరు తిన్నారో ఏమోగాని,మల్ల రిపోర్ట్ రాసే పని లగడపాటి,రాయపాటి,కావూరి,సుబ్బిరామి ల కిరాయి రాతగా౦డ్లకు అవుట్ సోర్సింగ్ చేసినట్టున్నావు అవునుమల్ల, మంచిగ మందు,విందు అన్నీ అరుసుకున్నంక రెట్టకు దెబ్బ తగలకుండ రాసిపెట్టేతోడుంటే ఇంకేం గావాలె

ఆ కిరాయిరాత గాళ్ళు ఆరు అడ్డగోలుసిఫారస్లు చేసిండ్రు దాంట్లో మీరు నాలుగు కొట్టేసినట్టు నాటకం చేసి అయిదోది ఏదో ఇచ్చినట్లు ఇచ్చి ఎన్నోరైడర్లు పెట్టి కుటిల కువాడపు రాజకీయం చేసిండ్రు ఇక ఆరోది పుచ్చిపోయిన పాత చింతకాయ తొక్కు. ఆయనుంటే మంగలోని తో పనేముంది అన్నట్లు

ఇంతకు ముందు ఒప్పుకున్న రక్షణలు ఆంధ్రులు సక్కగ ఏడ్సిఉంటె ఇన్నేండ్ల సంది ఈ గొడవ, లొల్లి ఎందుకుంటది ఎనకటికి నీ అసంటోడే కొ౦డను తొవ్వి ఎలుకను పట్టిండ౦ట వాడేమో తెల్వక తొవ్విండు, మీరేమో ఈ దోపిడీ దొంగల ‘హరామి’ తిని నీతిని, నిజాయితిని ‘ఖులే ఆ౦’ ఖూని చేసి నాటకమాడిండ్రు.

ఇ౦క మీ రిపోర్ట్ ఎనిమిదవ అధ్యాయ మైతే దేశ ప్రజాస్వామ్యానికే పెద్ద షాకు నిచ్చింది ఇదేమి సీక్రెట్ రిపోర్ట్ ?నీలాంటి సుప్రీం కోర్ట్ జడ్జి కమిటీ ఇవ్వవలసిన రిపోర్టా ఇది? నీవెక్కడున్నావు? భారతదేశం లోనా లేక ఎక్కడైనా ‘బనానా రిపబ్లిక్’ లోనా? హైకోర్ట్ జడ్జి గారు కేసు మొదట్లో చేసిన కామెంట్స్ చూసి పరేషాన్ అయినం కాని ఇప్పుడు చూస్తే అయన అన్నది చాల తక్కువ అనిపిస్తున్నది నాలుగున్నర కోట్ల అభాగ్య తెలంగాణ ప్రజలు యాబై నాలుగేండ్ల సంది ఆంధ్ర rajakeeya rరాజకీయ నాయకుల చేతుల్లో అరిగోసలు పడి ఒక వెయ్యి మంది ప్రాణ త్యాగం చేసి ఒక పక్క గోడాడుతుంటే నీవు ఆంధ్రోల్లతో కుమ్మక్కై ఈ ఉద్యమం ఎట్లా అణచాలే, రాజకీయంగా ఎవరి గాలి ఎ ట్ల తియ్యాలే న్యూస్ పేపర్లు ఎట్లా మేనేజ్ చెయ్యాలే, స్టూడెన్ట్లని ఎట్లా kottaleకొట్టి హిమ్సించాలే ఏం లాఠీలు,తూటాలు వాడాలె , నక్సలైట్లు ,టెర్రరిస్టులు ఎట్ల ఉరికి వస్తరు తెలంగాణ నిండా అని చెప్పిప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చినావు బుధ్ధిఉన్న ఎవడైనా నీ రిపోర్ట్ చూసి తల దిన్చుకోక తప్పదు ఇంత మోసంతో దుర్మార్గంతో అవినీతి తో కూడుకొన్న కమిటీ రిపోర్ట్, స్వతంత్ర భారతం లో రాలేదంటే అబద్ధం కాదు సుప్రీం కోర్ట్ జడ్జి ఇజ్జత్ మూడు కాసులకు తీసేసినవు ఇది ఆంధ్ర రాజకీయ నాయకుల గలీజు రాజకీయ సంస్కృతికి

మీ అవినీతి, ఆత్మవంచనకు అక్షరాల అద్దం పడుతుంది మీరు ఆ ‘థగ్గులు పిండారీ’లతో చేతులు కలిపి చరిత్ర హీనుల య్యిండ్రు

మిస్టర్ శ్రీకృష్ణ! తెలంగాణా ప్రజలు నీ కమిటీ మెంబర్లను నమ్మక పోయి నా నీ బొంబాయి అల్లర్ల రిపోర్ట్ చూసి నీ నిజాయితి మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నీకు సహకరించిండ్రు సమాచార మి చ్చిండ్రు వారి ఆవేదన వెల్ల bosuబోసు కున్నరు కానీ andhraమీరు ఆంధ్ర సామ్రాజ్యవాద దుర్మార్గులకు, అవినీతి పరులకు అమ్ముడుపోయి వారికి వెన్ను పోటు పొడిచావు నీ ఖ్యాతికి నీవే గోరి కట్టుకున్నావు. చరిత్ర నిన్ను క్షమించ దు తెలంగాణా ప్రాంత చరిత్రలో నీవు మరిచి పోలేని చరిత్ర హీనుడిగా మిగిలి పోతావు నీ రిపోర్ట్ తో భారత దేశం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా స్వామ్యాన్ని ఎంత మంచిగ ముందుకు తీసుక పోతున్న వో చాలా బాగ అర్థమైతుంది బయటి ప్రపంచానికి. ఇ౦కపోతే ప్రజల యొక్క ,ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు, తెలంగాణ ప్రజలను ఈ రావణ కాష్ష్టంలోకి బలవంతంగా దొబ్బిన కాంగ్రెస్స్ పార్టీ నీవు నీ కమిటీ సభ్యులు కలిసి ఆడిన ఈ దుర్మార్గపు నాటకాన్ని తెలంగాణా చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటది. ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఈ ద్రో హానికి త్వరలోనే మూల్యం చేల్లిస్తయి . మీరు కూడా మీ జీవిత కాలంలోనే ఈ మీ నికృష్ట రిపోర్ట్ కు sarainసరైన ఫలితం అనుభవిస్తరు నీ ఈ పనికి మాలిన రిపోర్ట్ తో మా ఉద్యమం అగుతందనుకోకు

అందరి నీచ నికృష్ట రాజకీయాలు, ఇప్పుడు బాగా అర్థమయినయి మా జనం గుండెల్లో మంటలు సునామీలయి తున్నాయి

మీ రిపోర్ట్ సంవత్సర కాలంలో, మల్ల మీ ఈ రిపోర్ట్ వల్ల తెలంగాణా ప్రజలకు పూర్తిగా తెలిసి పోయింది ఎవరు తమ వాళ్ళో ఎవరు పరాయి మనుషులో వాళ్ళ శత్రు మూక లు ఎక్కడెక్కడ dagi పొంచి ఉన్నాయో, ఇక నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల జగన్నాథ రథ చక్రాల కింద ఆ మూకల నలిపేయడమే మా తరువాతి కార్య క్రమం.

Thanks Aditya for sharing

Your Ad Here